తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2020, 10:12 AM IST

ETV Bharat / business

ద్రవ్యోల్బణం దెబ్బతో స్టాక్​ మార్కెట్లకు నష్టాలు

ద్రవ్యోల్బణం 5 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, కూరగాయలు, ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ఫలితంగా ఇవాళ దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Sensex, Nifty off to choppy start amid weak macro data
ద్రవ్యోల్బణం దెబ్బతో స్టాక్​మార్కెట్లకు నష్టాలు

దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ద్రవ్యోల్బణం 5 ఏళ్ల గరిష్ఠానికి(7.35 శాతానికి) చేరుకున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడమే ఇందుకు కారణం. కూరగాయలు, ఉల్లిపాయల ధరలు పెరగడం ఇందుకు తోడైంది.

ద్రవ్యోల్బణం వల్ల ఆర్​బీఐ తన కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం తగ్గుతుందని, ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 58 పాయింట్లు కోల్పోయి 41 వేల 801 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 12 వేల 320 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

టాటా స్టీల్​, బీపీసీఎల్​, హెచ్​సీఎల్​ టెక్​, ఎమ్​ అండ్​ ఎమ్​, టీసీఎస్​, ఏషియన్ పెయింట్స్, వేదాంత, గెయిల్​, జేఎస్​డబ్ల్యూ రాణిస్తున్నాయి.

ఎస్​ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఓఎన్​జీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్​ నేలచూపులు చూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిక్కీ, కోస్పీ లాభాల్లో ట్రేడవుతుండగా, హాంగ్​సెంగ్​, షాంగై కాంపోజిట్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ 4 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.70.82గా ఉంది.

ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.17 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.31 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:సీఎండీ పదవీ విభజన గడువు రెండేళ్లు పొడిగింపు: సెబీ

ABOUT THE AUTHOR

...view details