తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2020, 5:07 PM IST

ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం ధర

బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.450కి పైగా ఎగిసింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.63 వేల పైకి చేరింది.

10 GRAMS GOLD PRICE TODAY
పది గ్రాముల బంగారం ధర

ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.454 పెరిగి.. రూ.51,879 వద్దకు చేరింది.

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతూ వస్తుండటం వల్ల.. దేశంలో బంగారం ధర తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.751 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.63,127 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,910 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 24.25 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:పండుగ సీజన్ సేల్​కు అమెజాన్ రెడీ

ABOUT THE AUTHOR

...view details