తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం ధర పైపైకి.. రూ.53 వేలకు చేరువలో వెండి

బంగారం, వెండి ధరలు గురువారం కూడా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.232 పెరిగింది. వెండి ధర కిలో రూ.53 వేలకు చేరువైంది.

By

Published : Jul 9, 2020, 6:16 PM IST

GOLD PRICE TODAY
నేటి బంగార ధర

బంగారం ధర గురువారం రూ.232 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 50,184 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం వల్ల పసిడిపై పెట్టుబడులు పెరిగి.. ధరలు ఈ స్థాయిలో పుంజుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వెండి ధర కిలోకు ఏకంగా రూ.1,275 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.52,930 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,813 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 18.94 డాలర్లుగా ఉంది

ఇదీ చూడండి:ఇన్​స్టా​​ సహా ఆ 89 యాప్​లపై సైన్యం నిషేధం

ABOUT THE AUTHOR

...view details