తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మత్తులో భార్య ముక్కు కొరికేసిన భర్త..!

దంపతుల మధ్య తలెత్తిన గొడవలో భార్య ముక్కు కొరికేశాడు ఓ భర్త. మత్తుకు బానిసగా మారిన తన ఆగడాలను భార్య ప్రశ్నిస్తోందనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. పంజాబ్​లోని బటిండాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By

Published : May 21, 2019, 7:49 PM IST

Updated : May 21, 2019, 9:29 PM IST

మత్తులో భార్య ముక్కు కొరికేసిన భర్త..!

మత్తులో భార్య ముక్కు కొరికేసిన భర్త..!

పంజాబ్​లోని బటిండా నగరంలో దారుణం జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచి చెప్పిన భార్య ముక్కును కొరికేశాడు ఆమె భర్త అమన్​దీప్​ మిట్టల్​. బాధిత మహిళ 'షీతల్'... స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలి​గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వీరు బతిండాలోనే కలిసి జీవిస్తున్నారు. అయితే, కొంతకాలంగా అమన్​దీప్​ మత్తుకు బానిసగా మారాడు. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. షీతల్​కు ఇది రెండో వివాహం కాగా అమన్​దీప్​కు మూడోది.

తాజాగా మత్తుపదార్థాలు సేవించి ఇంటికొచ్చిన భర్తతో గొడవపడ్డారు షీతల్​. భార్య ప్రశ్నలతో కోపంతో ఊగిపోయిన అమన్​దీప్​ ఆమెపై భౌతిక దాడి చేశాడు. అదే క్రమంలో పంటితో భార్య ముక్కును కొరికేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అమన్​దీప్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు షీతల్​. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: ఒకే కాన్పులో అరడజను​ మంది పిల్లలు

Last Updated : May 21, 2019, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details