తెలంగాణ

telangana

అమెరికాకు బయలుదేరిన ప్రధాని మోదీ

By

Published : Sep 22, 2021, 11:34 AM IST

Updated : Sep 22, 2021, 11:45 AM IST

అమెరికా పర్యటనకు బుధవారం ప్రధాని మోదీ(modi us visit 2021) బయలుదేరారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా దిల్లీలోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు.

PM Modi
ప్రధాని మోదీ

అమెరికాలో నాలుగు రోజుల పర్యటనలో(modi us visit) భాగంగా దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(modi us visit 2021). తొలిసారి నేరుగా నిర్వహిస్తోన్న క్వాడ్​ సదస్సులో పాల్గొననున్నారు. క్వాడ్​ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రసంగించనున్నారు.

అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోదీ

మోదీ ట్వీట్​..

అమెరికా పర్యటనకు(modi us visit 2021) ముందు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ పర్యటనలో భారత్​- అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో సమీక్షించనున్నట్లు తెలిపారు. పరస్పర ప్రయోజనం ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నట్లు మోదీ(modi us visit) వెల్లడించారు. అలాగే ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో(Modi UNGA) ఉగ్రవాదంపై పోరు, వాతవారణ మార్పులు సహా పలు అంశాలపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాని మోదీ

"అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగాలతో కలిసి తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్న క్వాడ్​ సమ్మిట్‌లో పాల్గొంటాను. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని భవిష్యత్​ కార్యచరణ ప్రాధాన్యతలను గుర్తించడానికి ఈ సదస్సు అవకాశాన్ని అందిస్తుంది. అమెరికా పర్యటన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం, క్వాడ్​ దేశాలతో సంబంధాల బలోపేతానికి, ముఖ్యమైన అంతర్జాతీయ సమస్యలపై సహకారాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది."

- ప్రధాని నరేంద్ర మోదీ

ఈ నెల 22-25 మధ్య అగ్రరాజ్యంలో మోదీ పర్యటించనున్నారు.

ఇదీ చూడండి:'భారత్-అమెరికా బంధం బలోపేతానికి మోదీ పర్యటన కీలకం'

Last Updated : Sep 22, 2021, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details