తెలంగాణ

telangana

'మమతకు గాయం'పై సీబీఐ విచారణకు సుప్రీం నో

By

Published : Apr 9, 2021, 1:21 PM IST

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ గాయపడిన నందిగ్రామ్​ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించేందుకు నిరాకరించింది.

Supreme Court refuses to entertain a petition seeking a CBI investigation
మమత కాలి గాయంపై సీబీఐ విచారణకు సుప్రీం నో

తృణమూల్​ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే కోల్‌కతా హైకోర్టుకు వెళ్లేందుకు పిటిషనర్‌కు అనుమతి కల్పించింది సుప్రీంకోర్టు.

గత నెల 10న నందిగ్రామ్‌లో నామినేషన్​ వేసి తిరిగి వస్తుండగా జరిగిన దాడిలో సీఎం మమతకు గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details