Mob lynching in Jharkhand: కలప కోసం అక్రమంగా చెట్లు నరికేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిపై గ్రామస్థులు మూకదాడి చేశారు. అనంతరం యువకుడి శరీరానికి నిప్పంటించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఝార్ఖండ్ సిమ్దేగా జిల్లాలోని బేస్రజరా బజార్లో ఈ ఘటన జరిగింది.
మృతుడిని సంజూ ప్రధాన్గా (30) గుర్తించారు అధికారులు. నిందితుడు చెట్లు నరుకుతున్నాడని తెలుసుకొని వందల సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అతడు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పోలీసులకు అప్పగించేందుకూ నిరాకరించారు. గ్రామస్థులతో పోలీసులు అనేక గంటలు మంతనాలు జరిపిన తర్వాత శవాన్ని తీసుకెళ్లేందుకు అనుమతించారు.