తెలంగాణ

telangana

By

Published : Sep 13, 2022, 4:30 PM IST

ETV Bharat / bharat

లాలూ​కు కిడ్నీ మార్పిడి.. కోర్టు పర్మిషన్​ కోరిన మాజీ సీఎం

ఆర్​జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​కు త్వరలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగనుంది. ఇందుకోసం సింగపూర్​ వెళ్లేందుకు వీలుగా పాస్​పోర్ట్ ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు.

lalu prasad yadav health news
లాలూ​కు కిడ్నీ మార్పిడి.. కోర్టు పర్మిషన్​ కోరిన మాజీ సీఎం

విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తన పాస్​పోర్ట్​ను ఇవ్వాలని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం తాను సింగపూర్​ వెళ్లాల్సి ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్​పై సీబీఐ కోర్టు త్వరలోనే విచారణ జరపనుందని లాలూ తరఫు న్యాయవాది ప్రభాత్ కుమార్ తెలిపారు.

Lalu Prasad health condition : దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ.. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన రెండు మూత్రపిండాలు 75శాతం మేర దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహం, హైబీపీతో లాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24న ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఈ నెల 20నే లాలూ సింగపూర్​ వెళ్తారని సమాచారం.

అవిభాజ్య బిహార్​కు లాలూ ప్రసాద్​ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. 1996 జనవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఐదు కేసుల్లో లాలూకు శిక్ష పడింది. అనారోగ్య సమస్యలతో కొంతకాలం క్రితం ఆయన బెయిల్​పై విడుదలయ్యారు. పాస్​పోర్ట్ సీబీఐ కోర్టు వద్దే ఉండగా.. విదేశాలకు వెళ్లడం కోసం ఇవ్వాలని ఇప్పుడు పిటిషన్ వేశారు. ఇదే తరహాలో.. లాలూ అభ్యర్థన మేరకు జూన్​ 14న రెన్యువల్​ కోసం పాస్​పోర్ట్​ను ఇచ్చింది సీబీఐ కోర్టు.

ABOUT THE AUTHOR

...view details