తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు అంతరాయం

బొగ్గు లోడింగ్​ కోసం వెళ్తున్న ఓ గూడ్స్​ రైలు ప్రమాదానికి గురైంది. 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణానష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

By

Published : Aug 10, 2021, 5:53 PM IST

Updated : Aug 10, 2021, 6:37 PM IST

odisha derail
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఒడిశాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం మధ్యాహ్నం బొగ్గు లోడింగ్​ కోసం భద్రక్ నుంచి ధమ్రాకు వెళుతున్న ఈ రైలు బోగీల్లో 13 విడిపోయినట్లు అధికారులు తెలిపారు. చరంపా ప్రాంతంలోని ధమ్రా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ రైలులో మొత్తం 60 బోగీలున్నాయి. దీనితో కొద్ది సేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 10, 2021, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details