Facebook Cyber Crime: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఓ మహిళ బహుమతులకు ఆశపడి రూ.42 లక్షలు పోగొట్టుకుంది. దిల్లీలో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ జరిగింది..
సెక్టార్ 45లో నివసించే బాధితురాలికి కొన్ని నెలల క్రితం ఫేస్బుక్లో నిందితుడితో పరిచయం ఏర్పడింది. ఆర్తీ అనే పేరుతో నిందితుడు బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి వివరాలు సేకరించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బాధితురాలికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. బాధితురాలికి చెందిన బహుమతులు ముంబయిలోని తమ కార్యాలయంలో ఉన్నాయని.. అవి అందాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు. బాధితురాలి పేరున బంగారం, వాచీలు సహా రూ.55 లక్షలు విలువ చేసే నగదు ఉందని నిందితులు పేర్కొన్నారు.