తెలంగాణ

telangana

By

Published : Jun 24, 2021, 7:20 PM IST

Updated : Jun 24, 2021, 7:26 PM IST

ETV Bharat / bharat

CBSE: సోషల్​ మీడియా వేదికగా విద్యార్థులతో పోఖ్రియాల్ మాటామంతి

కొవిడ్​తో రద్దయిన సీబీఎస్​ఈ(CBSE) బోర్డు పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల వేదికగా విద్యార్థులతో మాట్లాడనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం.. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తామని వెల్లడించారు.

CBSC students
పోఖ్రియాల్

కరోనా కారణంగా రద్దయిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలపై విద్యార్థుల అనుమానాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్ నివృతి చేయనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులతో శుక్రవారం(జూన్​ 25) సాయంత్రం 4 గంటలకు మాట్లాడనున్నారు. కొవిడ్​ అనంతర ఆరోగ్య సమస్యలతో ఎయిమ్స్​లో చేరిన పోఖ్రియాల్​కు.. తమ ఆందోళన, సందేహాలు తొలగించమని విద్యార్థులు సందేశాలు పంపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో మాట్లాడనున్నట్లు ఆయన వెల్లడించారు.

"ఇప్పటికే విద్యార్థులు చాలా సందేశాలు పంపారు. అందులో కొంతమంది నా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. మరికొంతమంది పరీక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం వల్ల మీతో మాట్లాడలేకపోతున్నా. అయితే సీబీఎస్​ఈ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. ట్విట్టర్​, ఫేస్​బుక్​, మెయిల్​ ద్వారా కూడా పంపవచ్చు" అని పోఖ్రియాల్​ వరుస ట్వీట్​లు చేశారు.

10,12 తరగతుల బోర్డు పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్​ఈ.. ప్రత్యామ్నాయ అంచనా విధానాన్ని ప్రకటించింది. పాఠశాలలు.. పదో తరగతి మార్కులను జూన్ 30లోపు సమర్పించాలని ఆదేశించగా.. పన్నెండో తరగతి మార్కులను అంచనా వేయడానికి జూలై 15 వరకు గడవు ఇచ్చింది.

ఇదీ చూడండి:ట్విట్టర్‌ ఎండీకి హైకోర్టులో ఊరట

Last Updated : Jun 24, 2021, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details