తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త ఎంపీలకు సోనియా గాంధీ పాఠాలు

కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎంపీలతో యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ వార్‌రూంలో ఎంపీలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్లు హాజరయ్యారు.

By

Published : Jul 9, 2019, 6:16 AM IST

Updated : Jul 9, 2019, 7:45 AM IST

పార్టీ కొత్త ఎంపీలకు సోనియా గాంధీ పాఠాలు

యూపీఏ ఛైర్​పర్సన్​, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ​ కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ వార్‌రూంలో ఎంపీలకు నిర్వహించిన ఈ అవగాహనా కార్యక్రమానికి రాహుల్​ గాంధీ హాజరయ్యారు.

పార్లమెంటులో వ్యవహరించాల్సిన విధివిధానాలపై నూతన ఎంపీలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో రాహుల్​ గాంధీ ప్రసంగించలేదు. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కే సురేశ్, రాజీవ్​ గౌడ, జైరాం రమేశ్ ఈ భేటీలో పాల్గొన్నారు.

నేడు పార్టీ లోక్​సభ ఎంపీలతో సోనియా గాంధీ సమావేశం కానున్నారు.

రాజ్​ ఠాక్రేతో భేటీ...

సోనియాగాంధీని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే కలిశారు. దిల్లీలోని సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఈవీఎంల అంశం సహా మహరాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సోనియాగాంధీ, రాజ్​ ఠాక్రే భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Last Updated : Jul 9, 2019, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details