తెలంగాణ

telangana

కశ్మీర్​లో ఆంక్షలు ఇంకెన్ని రోజులు: సుప్రీంకోర్టు

By

Published : Oct 24, 2019, 12:02 PM IST

అధికరణ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​లో విధించిన ఆంక్షలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వానికి సూచించింది సుప్రీం కోర్టు. రెండు నెలలు గడిచినా.. ఇంకా ఎన్నిరోజులు కొనసాగిస్తారని ప్రశ్నించింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఇతర పద్ధతులను కనుక్కోవాలని నిర్దేశించింది.

కశ్మీర్​లో ఆంక్షలు ఇంకెన్ని రోజులు: సుప్రీంకోర్టు

అధికరణ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షలపై జమ్ముకశ్మీర్​ ప్రభుత్వానికి చురకలు అంటించింది సుప్రీంకోర్టు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షలు విధించినప్పటికీ... ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. రెండు నెలలు గడిచినా పలు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగించటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

"ఎన్ని రోజులు ఆంక్షలు కొనసాగించాలని అనుకుంటున్నారు? ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. ఈ పరిస్థితులను మార్చేందుకు ఇతర పద్ధతులను కనుక్కోవాలి. మీరు ఆంక్షలు విధించినప్పటికీ.. మీ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అది మీరు చేస్తున్నారా? "
- సుప్రీం ధర్మాసనం.

రోజువారీగా ఆంక్షలను సమీక్షిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. 99 శాతం ప్రాంతాల్లో ఆంక్షలు తొలగించినట్లు చెప్పారు. సరిహద్దు సమస్యల కారణంగా అంతర్జాలంపై ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.

తదుపరి విచారణను నవంబర్​ 5కు వాయిదా వేసింది ధర్మాసనం.

ఇదీ చూడండి: దంగల్​ 2019: 'హంగ్​' దిశగా హరియాణా!

ABOUT THE AUTHOR

...view details