తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ముందు ఈసీ లొంగిపోయింది : రాహుల్​

ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ​గాంధీ. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన అనుచరులకు ఈసీ లొంగిపోయిందని విమర్శించారు.

By

Published : May 20, 2019, 12:04 AM IST

మోదీ ముందు ఈసీ లొంగిపోయింది : రాహుల్​

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన అనుచరుల ముందు లొంగిపోయిందని ఆరోపించారు. అందుకే ఇక నుంచి ఎన్నికల సంఘానికి ఏమాత్రం భయపడేది లేదని... గౌరవం కూడా ఇవ్వమని ట్వీట్​ చేశారు.

రాహుల్​ ట్వీట్

" ఎన్నికల బాండ్ల నుంచి ఈవీఎంల అవకతవకలు.. నమోటీవీ, మోదీ సైన్యం నుంచి ఎన్నికల షెడ్యూల్​​ మార్పు వరకు చూశాం. ఇప్పుడు కేదార్​నాథ్​లో నాటకం నడుస్తోంది. నరేంద్రమోదీ, ఆయన అనుచరుల ముందు ఎన్నికల సంఘం లొంగిపోయిందని దేశ ప్రజలందరికీ స్పష్టమవుతోంది. ఇంతవరకు ఈసీకి భయపడ్డాం, గౌరవమిచ్చాం. ఇక నుంచి అవేవీ ఉండవు. "
-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details