తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​ ప్రకటనల ఖర్చులో భాజపా టాప్​

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార ప్రకటనల్లో ఫేస్​బుక్​, గూగుల్​ ముందంజలో నిలిచాయి. ఫిబ్రవరి నుంచి మే వరకు ఈ రెండు సంస్థలకు ప్రకటనల నిమిత్తం రాజకీయ పార్టీలు రూ.53 కోట్లు కుమ్మరించాయి. ఖర్చు  విషయంలో పార్టీల పరంగా చూస్తే భాజపా మొదటి స్థానంలో ఉంది.

By

Published : May 19, 2019, 3:31 PM IST

Updated : May 19, 2019, 6:06 PM IST

భాజపా

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తాయి. ఈ డిజిటల్​ ప్రపంచంలో అందరికీ చేరువకావాలంటే సామాజిక మాధ్యమాలే మార్గం. ప్రస్తుత సార్వత్రికంలో డిజిటల్​ మాధ్యమాలన్నీ రాజకీయ పార్టీల ప్రకటనలతో నిండిపోయాయి.

ఫేస్​బుక్​.. భాజపాలదే పైచేయి

రాజకీయ ప్రకటనల్లో ఫేస్​బుక్​, గూగుల్​ టాప్​లో నిలిచాయి. ఫిబ్రవరి-మే మధ్యకాలంలో ఈ రెండు సంస్థలకు పార్టీలు రూ.53 కోట్లు కుమ్మరించాయి. పార్టీలపరంగా చూస్తే భాజపా మొదటిస్థానంలో ఉంది. ఫేస్​బుక్​లో ప్రకటనలు, పేజీల కోసం రూ.4.23 కోట్లు.. గూగుల్​లో రూ.17కోట్లు ఖర్చు చేసింది కమలదళం.

ఫేస్​బుక్​ యాడ్​ లైబ్రరీ నివేదిక ప్రకారం మొత్తం 1.21 లక్షల రాజకీయ ప్రకటనలు పోస్ట్​ కాగా రూ.26.5 కోట్లు అర్జించింది ఆ సంస్థ. గూగుల్​, యూట్యూబ్​, ఇతర భాగస్వామ్య మాధ్యమాలు కలిపి 14,837 ప్రకటనలతో రూ.27.36 కోట్లు సంపాదించాయి.

కాంగ్రెస్​

  • ఫేస్​బుక్​: ప్రకటనలు-3,686... ఖర్చు-రూ.1.46 కోట్లు
  • గూగుల్​: ప్రకటనలు-425... ఖర్చు-రూ.2.71కోట్లు

తృణమూల్​ రూ.29.28 లక్షలు, ఆమ్​ఆద్మీ పార్టీ రూ.13.62 లక్షలు ఖర్చు పెట్టాయి.

ఇదీ చూడండి: 'సార్వత్రికం' తుది దశ: లైవ్​ అప్​డైట్స్​

Last Updated : May 19, 2019, 6:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details