తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ నెల 22న ఫ్రాన్స్​ పర్యటనకు మోదీ

ఈ నెల 22 నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్​లో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడితో ఉన్నతస్థాయి చర్చలు జరపనున్నారు. అనంతరం పారిస్​లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారతీయ సంఘాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ.

By

Published : Aug 19, 2019, 5:40 PM IST

Updated : Sep 27, 2019, 1:19 PM IST

ఈ నెల 22న ఫ్రాన్స్​ పర్యటనకు మోదీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22న ఫ్రాన్స్​కు వెళ్లనున్నారు. రక్షణ, అణు రంగం, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలపేతానికి ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో చర్చలు జరపనున్నారు మోదీ.

ఫ్రాన్స్​ నుంచేఈ నెల 23న యూఏఈ, బహ్రెయిన్​ పర్యటనకు బయలుదేరనున్నారు ప్రధాని. 25న ఫ్రాన్స్​కు తిరిగి వచ్చి బియరిజ్​ నగరంలో జరగనున్న జీ7 సదస్సులో పాల్గొననున్నారు.

యునెస్కోలో ప్రసంగం...

గురువారం సాయంత్రం మోదీ ఫ్రాన్స్​కు చేరుకుంటారు. అనంతరం ఆ దేశాధ్యక్షుడిని కలిసి వ్యూహాత్మక సంబంధాలపై చర్చిస్తారు. శుక్రవారం ఫ్రాన్స్​ ప్రధాని ఫిలిప్​తో చర్చలు జరుపుతారు. అనంతరం పారిస్​లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంఘాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఇదీ చూడండి:- స్విగ్గీలో బీర్​.. అడ్డంగా దొరికిపోయిన చోర్​!

Last Updated : Sep 27, 2019, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details