తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.16 వేల కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న మోదీ

బిహార్​లో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వరాల జల్లు ప్రకటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందుకోసం రానున్న పది రోజుల్లో దాదాపు రూ.16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సమాచారం.

By

Published : Sep 11, 2020, 8:29 PM IST

PM Modi to launch, inaugurate projects worth Rs 16K cr in Bihar
16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు.. త్వరలో మోదీ ఆవిష్కరణ!

బిహార్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 10 రోజుల్లో దాదాపు రూ.16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు, పథకాలను మోదీ ఆవిష్కరిస్తారని సమాచారం. ఇవి బిహార్ ప్రజల మౌలిక సదుపాయాలు, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని భాజపా భావిస్తోంది.

ఇవేనా అవి...

ఎల్పీజీ పైప్​లైన్​, ఎల్పీజీ బాటిలింగ్​ ప్లాంట్​, నమామీ గంగ, నీటి సరఫరా పథకాలలో భాగంగా మురుగు నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, కొత్త రైల్వే లైన్, రైల్వే వంతెన, రహదారులు, వంతెనలకు విద్యుదీకరణ, నిర్మాణ పనులను.. మోదీ ఆవిష్కరించనున్నారు. ఆయా కార్యక్రమాల ప్రారంభ సమయంలో ప్రజలతో వర్చువల్​ చర్చా వేదికల్లోనూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

బిహార్​ అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్​ 29తో ముగియనుంది. కొవిడ్ నేపథ్యంలో కొత్త నిబంధనలతో అక్టోబర్​- నవంబర్​లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే శ్రీకారం..

దేశవ్యాప్తంగా మత్స్యరంగాన్ని అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.20,050 కోట్లతో చేపట్టనున్న పీఎం మత్స్య సంపద యోజనను బిహార్‌లోనే ప్రారంభించారు మోదీ. వీడియోకాల్‌ ద్వారా గురువారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాడి రైతుల సమస్యలను సైతం పరిష్కరించి, వారికి ఉపయోగపడేలా 'ఈ-గోపాల' అనే యాప్‌ను ఆవిష్కరించారు.

బిహార్​ పోరులో దళిత ఓటరు ఎటువైపు?ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details