తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భద్రతపై ప్రధాని సమీక్ష

పాకిస్థాన్​తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా మరోమారు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ భద్రతా మండలి సమావేశం జరిగింది. తాజా పరిస్థితులు, దేశ రక్షణపై సమీక్ష నిర్వహించారు.

By

Published : Mar 3, 2019, 10:56 PM IST

భద్రతపై ప్రధాని సమీక్ష

పాకిస్థాన్​లో ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిస్థితులు, దేశ రక్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం మరోమారు జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించారు.

ఎన్​ఎస్​సీ సాధారణ సమావేశాల్లో భాగంగానే సమావేశమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ భద్రత, తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ పలు సలహాలు, సూచనలు చేసినట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​, విదేశాంగ కార్యదర్శి విజయ్​ గోఖలే హాజరయ్యారు.

1998లో అటల్​ బిహారీ వాజ్​పేయీ ప్రభుత్వ హయాంలో జాతీయ భద్రతా మండలి ఏర్పాటైంది. బ్రజేశ్​ మిశ్రా మొట్టమొదటి భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు.

ABOUT THE AUTHOR

...view details