తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- నక్సల్​ మృతి

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్ జరిగింది. ఓ మావోయిస్టును భద్రతాదళాలు మట్టుబెట్టాయి. సుక్మా జిల్లాలోని బిరాభట్టి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుకాల్పుల అనంతరం మావోయిస్టు మృతదేహం సహా తుపాకులను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jul 23, 2019, 11:59 AM IST

Updated : Jul 23, 2019, 4:56 PM IST

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- నక్సల్​ మృతి

ఛత్తీస్​గఢ్​లో సుక్మా జిల్లాలోని బిరాభట్టి గ్రామంలో భద్రతాదళాలు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గ్రామంలో రిజర్వ్​ గార్డ్​ బృందం తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిఘటించిన భద్రతా దళం వారిపై ఎదురుకాల్పులు జరిపింది.

ఆ ఘటనలో ఒక నక్సలైట్​ మృతిచెందాడు. ఘటనాస్థలం నుంచి భద్రతా దళాలు మృతదేహంతో పాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. మృతుడు మావోయిస్టుల పార్టీ కమిటీ కార్యదర్శి మడ్​కమ్​ హిద్మాగా గుర్తించారు. ఇతనిపై లక్ష రూపాయల రివార్డు ఉంది.

ఇదీ చూడండి:- కశ్మీర్​ సమస్యలో మధ్యవర్తిత్వానికి సిద్ధం: ట్రంప్

Last Updated : Jul 23, 2019, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details