తెలంగాణ

telangana

By

Published : Aug 31, 2020, 10:58 PM IST

ETV Bharat / bharat

పార్లమెంట్‌ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు నోటిఫికేషన్​ జారీ చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. సెప్టెంబరు 14న ప్రారంభమై... అక్టోబరు1తో ముగియనున్నాయి సమావేశాలు. కరోనా నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దృశ్యమాధ్యమం ద్వారా పర్యవేక్షించారు.

Notification issued for Monsoon session of Lok Sabha to begin from SEP 14th
పార్లమెంట్‌ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ

సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సమావేశాలు అక్టోబర్‌ 1తో ముగియనున్నాయి. కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఉభయ సభల సభ్యులు కరోనా బారినపడకుండా అనేక ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఉదయం 4 గంటల పాటు లోక్‌సభ, సాయంత్రం 4గంటల పాటు రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి ప్రశ్నోత్తరాల సమయం ఎత్తివేసే అవకాశం ఉండటం వల్ల శూన్యగంటతో ప్రారంభిస్తారని సమాచారం.

ఉభయ సభలూ ఒకేరోజు జరిగేలా ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యే ముందు ఎంపీలంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇప్పటికే కోరారు. ఉభయ సభల్లోనూ పలు చోట్ల ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దృశ్యమాధ్యమం ద్వారా పర్యవేక్షించారు.

ఇదీ చూడండి:'ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు'

ABOUT THE AUTHOR

...view details