తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు జీ7 దేశాల సదస్సు- ప్రత్యేక అతిథిగా మోదీ

ప్రపంచంపై ఆర్థిక మాంద్యం కోరలు చాచిన వేళ ఫ్రెంచ్‌ తీర ప్రాంత నగరం బియారిట్జ్‌లో జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు.

By

Published : Aug 25, 2019, 5:10 AM IST

Updated : Sep 28, 2019, 4:28 AM IST

నేడు జీ7 దేశాల సదస్సు- ప్రత్యేక అతిథిగా మోదీ

నేడు జీ7 దేశాల సదస్సు- ప్రత్యేక అతిథిగా మోదీ

వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని కుదిపేస్తోన్న వేళ, అనేక సందేహాలు, అపనమ్మకాల మధ్య జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం నేడు జరగనుంది. ఇందుకు ఫ్రెంచ్​ తీర ప్రాంత నగరం బియారిట్జ్​ వేదిక కానుంది.

వాణిజ్య యుద్ధాలు మాంద్యంలోకి నెట్టివేస్తాయని ఒప్పందాలు ఆర్థిక పురోగతికి బాటలు వేస్తాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌ జీ 7 దేశాలకు సూచించారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజాలపై పన్నులను ఉపసంహరించకుంటే ఫ్రెంచ్ వైన్‌పై సుంకాలు విధిస్తామని..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​, డొనాల్డ్​ ట్రంప్‌ విందు సమావేశం నిర్వహించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కలిసి రావాలని అమెరికాకు ఈ సందర్భంగా మెక్రాన్‌ సూచించారు.

ప్రపంచంలోని ఏడు సంపన్న దేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, ఇటలీ, కెనడా అధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారందరికీ ఆతిథ్య దేశాధ్యక్షుడు మెక్రాన్‌ విందు ఇచ్చారు.

ప్రత్యేక అతిథిగా...

భారత ‌ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా జీ 7 సమావేశాలకు హాజరవుతున్నారు. మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమెరికా అధ‌్యక్షుడు ట్రంప్‌తో వాణిజ్య సుంకాలపై మోదీ చర్చించే అవకాశముందని సమాచారం. అయితే ఇప్పటికే జీ7 సమావేశాల్లో భాగంగా మోదీతో కశ్మీర్​ అంశంపై చర్చిస్తానని ట్రంప్​ ఇప్పటికే తెలిపారు.

Last Updated : Sep 28, 2019, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details