తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని మోదీ పిలుపు

ప్లాస్టిక్ వినియోగ రహిత దేశంగా భారత్​ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్టోబరు 2నుంచి సింగిల్​ యూజ్ ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.

By

Published : Sep 27, 2019, 10:14 PM IST

Updated : Oct 2, 2019, 6:54 AM IST

ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేధించాలని మోదీ పిలుపు

అక్టోబరు 2 నుంచి ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని భారత్​లో నిషేధిస్తున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్లాస్టిక్ రహిత దేశంగా భారత్​ను మార్చేందుకు భారీ స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమెరికా న్యూయార్క్​లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు మోదీ. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని గతంలోనూ చెప్పినట్లు గుర్తు చేశారు.

ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగం

"నేను ఇక్కడకు వస్తున్నపుడు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను వాడరాదనే నినాదాలను ఐక్యరాజ్యసమితి భవనాల గోడలపై చదివాను. ఇప్పటికే భారత్‌ను ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ నుంచి విముక్తి కల్పించేందుకు భారీ కార్యాచరణ అమలు చేస్తున్నాం."

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని.

గతంలోనూ పలు అంతర్జాతీయ వేదికలపై ప్లాస్టిక్​ను నిషేధించాలని పిలుపునిచ్చారు మోదీ. ఆగస్టులో బియారిట్జ్​లో జరిగిన జీ-7 సదస్సులోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్​, నీటి సంరక్షణ, సౌర శక్తి వంటి కీలక అంశాల ప్రాధాన్యాన్ని తెలిపారు.


భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఏటా 20వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వాటి నుంచి 13నుంచి 14వేల టన్నుల ప్లాస్టిక్​ను మాత్రమే తిరిగి సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి: శాంతి స్థాపనకు మహాత్ముడి మార్గమే శరణ్యం: మోదీ

Last Updated : Oct 2, 2019, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details