తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపాకీ మిస్​ఫైర్- పోలింగ్​ అధికారి మృతి

బిహార్​ శివ్​హర్​లోని పోలింగ్​ కేంద్రంలో హోంగార్డు తుపాకీ మిస్​ఫైర్​ అయింది. తూటా తగిలి పోలింగ్​ అధికారి మృతిచెందారు.

By

Published : May 12, 2019, 1:08 PM IST

తుపాకీ మిస్​ఫైర్- పోలింగ్​ అధికారి మృతి

సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్​ సందర్భంగా బిహార్​ శివ్​హర్​లో విషాద సంఘటన జరిగింది. ఓ హోంగార్డు పొరపాటు... ఉపాధ్యాయుడి ప్రాణాలు బలిగొంది.

శివ్​హర్​ జిల్లా మాధవ్​పుర్​ సుందర్​ గ్రామంలో పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడు శివేంద్ర కుమార్​, మరికొందరు అక్కడ పోలింగ్​ విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు ఓ హోంగార్డు తుపాకీ పొరపాటున పేలింది. తూటా శివేంద్రకు తగిలింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా ప్రాణం విడిచారు శివేంద్ర.

హోంగార్డు తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్​ఫైర్ అయిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆరో దశలోనూ బంగాల్​ హింస్మాతకం

ABOUT THE AUTHOR

...view details