తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'

ఎన్నికల్లో ఓట్లు గెలుచుకునేందుకు కూటమి పార్టీలపై ఆధారపడొద్దని ఉత్తర్​ప్రదేశ్ బీఎస్పీ నాయకులకు సూచించారు పార్టీ అధినేత్రి మయావతి. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

By

Published : Jun 3, 2019, 7:30 PM IST

Updated : Jun 3, 2019, 8:23 PM IST

'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'

'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'

లోక్​సభ ఎన్నికల్లో మహాకూటమి ప్రదర్శనపై బహుజన్ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓట్లు గెలుచుకునేందుకు కూటమిపై ఆధారపడొద్దని పార్టీ నాయకులకు సూచించడమే ఇందుకు నిదర్శనం.

దిల్లీలో బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తర్​ప్రదేశ్​ విభాగం నాయకులతో సమావేశమయ్యారు మాయావతి. ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూటమిపై ఆధారపడకుండా పనిచేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యాలయ అధికారులు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు.

లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న 11 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. లోక్​సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో భాజపా నుంచి 9 మంది, బీఎస్పీ తరఫున ఒకరు, ఎస్పీ నుంచి ఒకరు ఉన్నారు.

ఉప ఎన్నికల్లో బీఎస్పీ 10 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు మాయావతి. బీఎస్పీ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు సమాజ్​వాదీ పార్టీ ఓట్లు సైతం తమ పార్టీకే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:సాధ్వీ ప్రజ్ఞా అభ్యర్థన తిరస్కరించిన ఎన్​ఐఏ కోర్టు

Last Updated : Jun 3, 2019, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details