తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరువు నష్టం కేసులో రాహుల్​కు బెయిల్​

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ, సీపీఎం నేత సీతారాం ఏచూరి ముంబయి కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త వేసిన పరువు నష్టం కేసులో రాహుల్​కు తాత్కాలిక ఊరట లభించింది. రూ.15 వేల పూచీకత్తుతో ఆయనను కోర్టు విడుదల చేసింది.

By

Published : Jul 4, 2019, 12:23 PM IST

Updated : Jul 4, 2019, 12:28 PM IST

ఆర్​ఎస్​ఎస్​ పరువు నష్టం కేసులో రాహుల్​కు బెయిల్​

ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీకి బెయిల్ లభించింది. రూ.15 వేల పూచీకత్తుపై ఆయనను ముంబయి న్యాయస్థానం విడుదల చేసింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా విచారణకు హాజరయ్యారు.

కర్ణాటకకు చెందిన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్​ 2017 సెప్టెంబర్​లో బెంగళూరులో హత్యకు గురయ్యారు. ఈ హత్య వ్యవహారంలో రాహుల్​ గాంధీ భాజపా-ఆర్​ఎస్​ఎస్​పై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ ఆరోపణలను తప్పుపడుతూ సంఘ్​ కార్యకర్త, న్యాయవాది ధ్రుతిమన్​ జోషి 2017లో కోర్టును ఆశ్రయించారు. రాహుల్​తో పాటు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీపీఎం నేత సీతారాం ఏచూరిపైనా పరువు నష్టం కేసు వేశారు.

జోషి ఫిర్యాదుతో రాహుల్, సీతారాం ఏచూరికి కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో సమన్లు జారీచేసింది. నేడు విచారణకు హాజరయ్యారు రాహుల్​, సీతారాం ఏచూరి.

ఇదీ చూడండి: ఎట్టకేలకు గాడినపడ్డ వాట్సాప్​, ఇన్​స్టా

Last Updated : Jul 4, 2019, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details