తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాజీనామాకు నై- ప్రక్షాళన కోసం మరిన్ని అధికారాలు'

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిపై కాంగ్రెస్​ అంతర్మథనం ప్రారంభించింది. వర్కింగ్​ కమిటీ సమావేశంలో ముఖ్యనేతలు పార్టీ వైఫల్యాలపై సమీక్షించారు. నేతలందరూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థించారు. కాంగ్రెస్​ పునరుజ్జీవానికి కృషి చేసే బాధ్యత అప్పగించారు.

By

Published : May 25, 2019, 5:54 PM IST

Updated : May 25, 2019, 7:50 PM IST

'రాజీనామాకు నై- ప్రక్షాళన కోసం మరిన్ని అధికారాలు'

'రాజీనామాకు నై- ప్రక్షాళన కోసం మరిన్ని అధికారాలు'

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ విస్తృతంగా చర్చించింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 4 గంటలపాటు జరిగిన భేటీకి... అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, అగ్రనేత సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్​ నేతలు హాజరయ్యారు.

లోక్​సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు రాహుల్​ గాంధీ సిద్ధపడ్డారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ ఏకగ్రీవంగా తోసిపుచ్చింది.

''కాంగ్రెస్​ అధ్యక్షుడు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు, ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో పగలూ రాత్రి పార్టీకి అండగా నిలిచినందుకు సీడబ్ల్యూసీ కృతజ్ఞతలు చెబుతోంది. కాంగ్రెస్​తో కలిసి పనిచేసిన మిత్రపక్షాలకు సీడబ్ల్యూసీ తరఫున ధన్యవాదాలు. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా ప్రతిపాదన చేశారు. కానీ.. కమిటీ ఏకగ్రీవంగా అధ్యక్షుడి నిర్ణయాన్ని తిరస్కరించింది. ఈ కఠిన సమయంలో పార్టీకి రాహుల్ నాయకత్వం,​ మార్గనిర్దేశకత్వం అవసరమని కమిటీ కోరింది.''

- వేణుగోపాల్​, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి పార్టీ పునర్నిర్మాణంలో పూర్తి స్వేచ్ఛను, అధికారాన్ని ఇస్తూ కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ తీర్మానం చేసింది. దేశ యువత, రైతులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీల కోసం చేస్తున్న సైద్ధాంతిక పోరాటాన్ని రాహుల్​ కొనసాగించాలని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా పిలుపునిచ్చింది.

"2019 ఎన్నికల్లో భారత ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ వినమ్రంగా స్వీకరిస్తోంది. 12.13 కోట్ల ఓటర్లు కాంగ్రెస్​కు మద్దతుగా నిలిచినందుకు వారికి సీడబ్ల్యూసీ కృతజ్ఞతలు చెబుతోంది. కాంగ్రెస్​ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.''

- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

పార్టీ ఓటమిపై మరింత లోతుగా చర్చించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.

''పార్టీ ఘోర వైఫల్యంగా నేను అంగీకరించను. కానీ.. మేం అంచనాలను మాత్రం అందుకోలేక పోయాం. ఈ సమావేశం... ఓటమిపై సాధారణ చర్చ కోసమే ఏర్పాటు చేశాం. త్వరలో భేటీ అయి అన్ని అంశాలపై లోతుగా విశ్లేషిస్తాం.''

- ఏకే ఆంటోనీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత

Last Updated : May 25, 2019, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details