తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2019, 12:00 AM IST

ETV Bharat / bharat

దేశంలోనే అత్యంత పొడవైన 'ఐక్యతా' నోట్​బుక్

సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో దేశంలోనే అత్యంత పొడవైన నోట్ పుస్తకాన్ని తయారుచేశారు అహ్మదాబాద్ యువకులు. నవనీత్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఐక్యతా మూర్తి చిత్రంతో సహా ఆయన జీవిత విశేషాల్ని ఇందులో ముద్రించారు.

దేశంలోనే అత్యంత పొడవైన 'ఐక్యతా' నోట్​బుక్

దేశంలోనే అత్యంత పొడవైన 'ఐక్యతా' నోట్​బుక్
సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ 'ఐక్యతా విగ్రహం' ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహంగా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్​లోని అహ్మదాబాద్​ యువకులు ఆ స్ఫూర్తితో దేశంలోనే అత్యంత పొడవైన పుస్తకాన్ని రూపొందించారు. దేశంలోని సంస్థానాల్ని భారత యూనియన్​ కిందికి తెచ్చిన ఐక్యతా మూర్తి సర్దార్​ వల్లభాయ్ పటేల్​ ఆదర్శప్రాయులని కీర్తిస్తున్నారు.

దేశంలోనే అత్యంత పొడవైన నోట్​ పుస్తకాన్ని సర్దార్​ పేరిట రూపొందించారు ఆ యువకులు. ఈ నోట్​బుక్​లోని ముఖచిత్రంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలువెత్తు మూర్తిని చిత్రించారు. సర్దార్​ పటేల్​ జీవిత విశేషాల్ని సైతం ముద్రించారు. అహ్మదాబాద్​లోని నవనీత్ ఎడ్యూకేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని రూపొందించారు .

"మేం 'యువ యునైట్ ఇండియా' అనే కార్యక్రమంతో ముందుకు వచ్చాం. నవనీత్ ఎడ్యుకేషన్​ లిమిటెడ్ ద్వారా భారత్​లోనే అత్యంత పొడవైన నోట్​బుక్​ను తయారుచేశాం. ఇది మీటరు పొడవుంటుంది. ఈ నోట్​బుక్​లో ఐక్యతపై సందేశాన్ని ముద్రించాం. సర్దార్​ వల్లభాయ్ పటేల్​ చిత్రాన్ని పొందుపరిచాం. దీనినే ఐక్యతా విగ్రహంగా పిలుస్తున్నారు. ఈ విగ్రహం నుంచే ప్రేరణ పొందాం." - నవనీత్ ఫౌండేషన్ ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details