తెలంగాణ

telangana

By

Published : Feb 8, 2020, 5:30 AM IST

Updated : Feb 29, 2020, 2:33 PM IST

ETV Bharat / bharat

దిల్లీ ఎన్నికల వేళ రాపిడో ఆఫర్.. ఓటర్లకు ఫ్రీ రైడింగ్​​

ఎన్నికల రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించినా వెళ్లి ఓటు వేయాలంటే కొందరికి బద్ధకం. మేలైన సమాజం కోసం తాపత్రయం ఉన్నా..  'రవాణా ఖర్చులు ఎవరు భరిస్తారు? ట్రాఫిక్​లో, బస్సుల్లో ఎవరు తిరుగుతారు' అనుకునేవారు మరికొందరు. అందుకే దిల్లీ ఎన్నికల రోజున ఓటర్లకు  ఉచిత రవాణా సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చింది ప్రముఖ బైక్​ ట్యాక్సీ సంస్థ రాపిడో.

Bike taxi aggregator offers free rides to Delhi voters on election day
దిల్లీ ఎన్నికల వేళ రాపిడో ఆఫర్.. ఓటర్లకు ఫ్రీ రైడింగ్​​

దేశ రాజధానిలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్​ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దిల్లీలోని ఓటర్లకు బంపర్​ ఆఫర్​ ప్రకటించింది బైక్​ ట్యాక్సీ యాప్​ రాపిడో. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు మూడు కిలోమీటర్ల వరకు ఉచిత రైడ్​ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

" దిల్లీ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాపిడో సంస్థ తన వంతు సాయం చేస్తోంది. అందులో భాగంగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారందరికీ ఉచిత రవాణా కల్పించాలని నిర్ణయించింది. దిల్లీలోని ఏ ప్రాంతంలోనైనా మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండే పోలింగ్​ కేంద్రాలకు ఓటర్లను 100శాతం పూర్తి ఉచితంగా చేరవేస్తాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో ఎన్నికలు ఎంతో కీలకం. అందుకే సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం."

-అరవింద్​ సంఖ, రాపిడో సహ వ్యవస్థాపకుడు.


రేపు ఉదయం 8 గంటల నుంచి, సాయంత్రం 6 గంటల వరకు దిల్లీ ఎన్నికల పోలింగ్​ జరగనుంది. కోటి 47 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినయోగించుకోనున్నారు. ఇందుకోసం 13వేల 750 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

ఇదీ చూడండి:మోదీ 'మాట'ను రికార్డుల నుంచి తొలగించిన వెంకయ్య

Last Updated : Feb 29, 2020, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details