తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ప్రాంతంలో శాంతి కోసం రెండు లక్షల బాండు

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​​లో సీఏఏ వ్యతిరేక నిరసనలను నియంత్రించడానికి స్థానిక యంత్రాంగం వింత చర్యలు చేపట్టింది. ​ 66 మంది నుంచి రూ. 2లక్షల బాండుపై సంతకాలు కోరింది కాన్పుర్​ స్థానిక యంత్రాంగం. ఆందోళనలు శాంతియుతంగా జరగాలని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు అదనపు నగర మేజిస్ట్రేట్​​ అగ్నిహోత్రి తెలిపారు.

By

Published : Jan 30, 2020, 7:15 PM IST

Updated : Feb 28, 2020, 1:46 PM IST

Kanpur admin asks 66 men to sign bonds of Rs 2 lakh to maintain peace
ఆ ప్రాంతంలో శాంతి కోసం రెండు లక్షల బాండు

ప్రజాస్వామ్యంలో నిరసనలు చేపట్టడం ప్రజల హక్కు. సాధారణంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారకుండా ఉండటానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ ఉత్తర్​ప్రదేశ్​లోని స్థానిక యంత్రాంగం ముందస్తు జాగ్రత్తగా.. కొంతమంది నుంచి పూచీకత్తులు సేకరించడానికి సిద్ధపడింది.

పూచీకత్తు ఎందుకు?

కాన్పుర్​లోని మహ్మద్​​ అలీ పార్క్​.. సీఏఏ-ఎన్​ఆర్​సీ నిరసనలకు కేంద్రబిందువుగా మారింది. ఈ ఆందోళనల్లో మహిళలే అధికంగా ఉండటం విశేషం. అయితే నిరసనల్లో ఎలాంటి హింస జరగకుండా స్థానిక యంత్రాంగం వింత చర్యలు చేపట్టింది. రూ. 2లక్షల బాండు మీద పూచీకత్తు సంతకాలు పెట్టాలని 66మందిని కోరింది.

మహిళలను పురుషులు ప్రేరేపించవచ్చు!

అయితే నిరసనలతో తమకు సంబంధం ఉనట్టు వీరు అంగీకరించలేదు. కానీ తమ కుటుంబంలోని అనేక మంది మహిళలు ఆందోళనల్లో పాల్గొంటున్నట్టు వీరిలో చాలా మంది ఒప్పుకున్నారు.

నిరసనల్లో పాల్గొనే విధంగా మహిళలను పురుషులు ప్రేరేపించే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టుఅదనపునగర మేజిస్ట్రేట్​ అనిల్​ అగ్నిహోత్రి తెలిపారు.

"ఛామన్​గంజ్​ పోలీసు పరిధిలోని మహ్మద్​​ అలీ పార్క్​ వద్ద ఆందోళనలతో సంబంధం ఉన్నవారికి... సీఆర్​పీసీ సెక్షన్​ 107,116 కింద నోటీసు జారీ చేశాం. పురుషుల ప్రేరణతో మహిళలు ఆందోళనల్లో పాల్గొనే అవకాశముంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ చర్యలు చేపట్టాం." - అనిల్​ అగ్నిహోత్రి, అదనపు నగర మేజిస్ట్రేట్

ఇదీ చూడండి:సీఏఏ వ్యతిరేక తీర్మానాలపై 'ఈయూ'లో చర్చ.. మార్చిలో ఓటింగ్​

Last Updated : Feb 28, 2020, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details