తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2020, 5:57 PM IST

ETV Bharat / bharat

బంగాల్​ ఎన్నికలకు ముందు ఎంఐఎంకు షాక్​

పశ్చిమ్​ బంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంఐఎం పార్టీ కీలక నేతలు.. తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. బంగాల్​లో కీలక నేత అన్వర్​ పాషా, అతని అనుచరులు.. టీఎంసీ కండువా కప్పుకున్నారు. భాజపాకు లాభం చేకూర్చేందుకు ఎంఐఎం పనిచేస్తుందని ఆరోపించారు.

AIMIM's key Bengal leader, many functionaries join TMC
బంగాల్​ ఎన్నికలకు ముందు ఎంఐఎంకు షాక్​

బంగాల్​ ఎన్నికలకు ముందు అసదుద్దీన్​ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి షాక్​ తగిలింది. అక్కడి ఎంఐఎం కీలక నేత అన్వర్​ పాషా సహా ఆయన అనుచరులు చాలా మంది తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఓట్లను చీల్చి.. భాజపాకు సాయం చేసేందుకే ఎంఐఎం పనిచేస్తుందని విమర్శించారు. కొందరు మతం పేరుతో దేశంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'బిహార్​లో మహాకూటమి ఓటమికి ఓవైసీనే కారణం'

''ఎంఐఎం.. ఓట్లను చీల్చి భాజపాకు సాయం చేస్తోంది. ఇది బిహార్​లో భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు లాభించింది. బంగాల్​లో మాత్రం ఇది సాధ్యం కాదు.''

- అన్వర్​ పాషా

రాష్ట్రంలోని ముస్లింలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పక్షాన నిలవాలని అభ్యర్థించారు అన్వర్​. ఎంఐఎం చీఫ్​ను బంగాల్​కు రావొద్దని అన్నారు.

ఇదీ చూడండి: మజ్లిస్ ప్రస్థానం : దారుస్సలాం నుంచి దిల్లీ రాజకీయాల్లోకి...

ఇటీవల బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలను గెల్చుకుంది ఎంఐఎం. అదే ఉత్సాహంలో బంగాల్​ బరిలో నిలవాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో.. కీలక నేతలు పార్టీ మారడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే.

ఇదీ చూడండి: బిహార్​లో 'ఎంఐఎం' జోరు- ఐదు సీట్లు కైవసం

ABOUT THE AUTHOR

...view details