తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో కీలక భేటీలు

జనవరి 31నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 30, 31న లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా సహా రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి అంతరాయాలు లేకుండా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలన్న ఉద్దేశంతో ఈ భేటీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

By

Published : Jan 28, 2020, 10:33 PM IST

Updated : Feb 28, 2020, 8:13 AM IST

sessions
పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో కీలక సమావేశాలు జరగనున్నాయి. జనవరి 30న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, 31న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తన నివాసంలో అన్ని పార్టీల నేతలతో భేటీ కానున్నారు. జనవరి 30న ఉదయం.. ప్రభుత్వం కూడా అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది.

ఎలాంటి అంతరాయాలు లేకుండా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలన్న ఉద్దేశంతో ఈ భేటీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గత రెండు సెషన్స్​లోనూ రాజ్యసభ 100 శాతం ఉత్పాదకత సాధించిన నేపథ్యంలో.. ఇదే రీతిన బడ్జెట్ సమావేశాలూ కొనసాగాలని వెంకయ్య నాయుడు నేతలకు సూచించనున్నారు.

జనవరి 31న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతాయి. విరామం తర్వాత మళ్లీ మార్చి 2 నుంచి, ఏప్రిల్ 3 వరకు జరుగుతాయి.

ఇదీ చదవండి: దిల్లీ దంగల్​: 'భాజపా.. ఆప్​... ఓ ఆటోవాలా'

Last Updated : Feb 28, 2020, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details