తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బైక్​​ కొనేందుకు బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు

కర్ణాటలోని చిక్కబల్లాపుర్​లో అమానవీయ ఘటన జరిగింది. ఫోన్​, బైక్​ కొనుగోలు చేసేందుకు తమ మూడు నెలల బిడ్డను రూ.లక్షకు అమ్మేసారు తల్లిదండ్రులు. గుడిసెలో ఉండే వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని గ్రామస్థులు ఆరాతీయడం వల్ల విషయం బయటపడింది.

By

Published : Aug 30, 2020, 11:09 AM IST

A Father sold three-month-old baby for  luxurious life
బైక్​​ కొనేందుకు బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు

బైక్​, ఫోన్​ కొనుక్కోవడానికి మూడు నెలల పసికందును అమ్మేసారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబల్లాపుర్​లో జరిగింది.

విలాసవంతమైన జీవితం కోసం...

మహాలక్ష్మి- నరసింహమూర్తి దంపతులు.. తినగల్లు గ్రామంలో చిన్న గుడిసెలో నివాసముంటున్నారు. అయితే ఇటీవలే వారు బైక్​, ఫోన్​ వంటి వస్తువులను కొనుగోలు చేశారు. ఇది గమనించిన గ్రామస్థులకు అనుమానం మొదలైంది.

దంపతులను పట్టుకుని ప్రశ్నించగా.. వారు చేసిన తప్పు అంగీకరించారు. తమ మూడు నెలల బిడ్డను.. సిద్లఘట్ట తాలుకా మలిమచనహల్లిలోని దంపతులకు లక్ష రూపాయలకు అమ్మేసినట్టు వెల్లడించారు.

గుడిసె

మహిళ, శిశు సంరక్షణ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించడం వల్ల ఈ పూర్తి వ్యవహారం బయటకువచ్చింది.

ఇదీ చూడండి:-తల్లి, అన్నను తుపాకీతో కాల్చి చంపిన మైనర్ బాలిక

ABOUT THE AUTHOR

...view details