తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు మావోలు హతం

ఛత్తీస్​గఢ్​లో ఇద్దరు మావోయిస్టులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బీజాపుర్​ పోలిస్​ స్టేషన్​లో 15 మంది నక్సలైట్లు లొంగిపోయారు.

By

Published : Apr 21, 2019, 1:34 PM IST

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు మావోలు హతం

నక్సల్స్​ మృతి

ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్ జిల్లా​లో నక్సలైట్లు- భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.

ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పామెడ్​లోని అడవుల్లో ఛత్తీస్​గఢ్​ పోలీసులు- తెలంగాణ గ్రేహౌండ్స్​ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా సిబ్బందిని గుర్తించిన నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరో 15 మంది...

ఈ ఘటన అనంతరం 15 మంది మావోయిస్టులు బీజాపుర్​ పోలీసు స్టేషన్​లో లొంగిపోయారు. వీరిందరిపై తలో లక్ష రూపాయల రివార్డు ఉన్నట్టు ఎస్పీ గోవర్ధన్​ ఠాకుర్​ తెలిపారు.

ఇదీ చూడండి:శ్రీలంకలో వరుస పేలుళ్లు- 140 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details