తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో మరో 24 మందికి కరోనా!

దేశంలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ, రాజస్థాన్​, చండీగఢ్​, హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్రాల్లో 24 కొత్త కేసులు నమోదయ్యాయి.

By

Published : Mar 20, 2020, 7:47 PM IST

covid 19 positive cases
భారత్​లో మరో 24 మందికి కరోనా!

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు ఈ వైరస్​ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 24 కేసులు నమోదయ్యాయి.

కేరళలో 12

కేరళలో మరో 12 మందికి కరోనా వైరస్​ పాజిటివ్​గా తేలింది. ఎర్నాకులంలోని నిర్బంధ కేంద్రంలో వైద్యం పొందుతున్న ఐదుగురు విదేశీయులు, కసార్గాడ్​లో ఆరుగురు, పాలక్కడ్​కు చెందిన ఒకరు వైరస్​ బారిన పడినట్లు గుర్తించారు. 55 ఏళ్లకు పైబడిన వారిని కొచిలోని కలమస్సేరి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 37కు చేరింది.

రాజస్థాన్​లో 6

రాజస్థాన్​లో మరో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. భిల్వారా జిల్లాలోని నిర్బంధ కేంద్రాల్లో ఉన్న 28 మందిలో ఆరుగురికి పాజిటివ్​ రాగా.. మరో 11 మందికి నెగిటివ్​గా తేలినట్లు జిల్లా పాలనాధికారి రాజేంద్ర భట్​ తెలిపారు.

చండీగఢ్​లో 4

చండీగఢ్​లో కరోనా విస్తరిస్తోంది. కొత్తగా మరో 4 కేసులు పాజిటివ్​గా తేలాయి.

ఇదీ చూడండి: సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​.. కరోనాపై చర్చ

ABOUT THE AUTHOR

...view details