అంతర్వేదిలో రథం దగ్ధం దుశ్చర్య వెనుక ఎవరు ఉన్నారనే విషయం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగా శివకళ్యాణి అన్నారు. దేవదాయశాఖ మంత్రి ఈ ఘటనను తీవ్రంగా పరిగణించకుండా విషయాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పడం బాధాకరమన్నారు. భక్తులను అరెస్టు చేసి రిమాండుకు పంపడం దారుణమని దుయ్యబట్టారు.
వైకాపా ప్రభుత్వం హిందువుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తోందో ప్రజలు గమనించాలని భోగా శివకళ్యాణి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం