ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతు భరోసా రెండో విడత చెక్కుల పంపిణీ

By

Published : Oct 27, 2020, 7:50 PM IST

రైతు భరోసా రెండవ విడత నగదు బదిలీ చెక్కులను వీరవాసరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్​ విడుదల చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

rythu bharosa cheque were distributed by veeravasaram mla
రైతు భరోసా రెండవ విడత నగదు బదిలీ చెక్కును రైతులకు అందించిన ఎమ్మెల్యే

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో రైతు భరోసా రెండో విడత నగదు బదిలీ చెక్కును ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్​ విడుదల చేశారు. తదుపరి వీరవాసరం ప్రధాన దారిపై రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఎడ్లబండి నడిపారు.

సీఎం జగన్​ రైతుల పక్షపాతి అని తెలిపారు. అనంతరం రైతుల లబ్దిదారులకు రూ. 2.80 కోట్ల విలువ గల చెక్కులను అందించారు. వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details