ETV Bharat / state

పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ - ఇంటింటికీ వెళ్లి స్వయంగా నగదు అందజేసిన మంత్రులు - Ministers Distributed Pensions

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 10:51 PM IST

Ministers Distributed Pensions by Going Door to Door in AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మేళతాళాలు, మంగళహారతులు, పూలతో ప్రజాప్రతినిధులను ఘనంగా స్వాగతించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని మొదటి నెలలోనే అమలు చేయడం పట్ల పింఛన్‌దారులు ఆనందం వ్యక్తం చేశారు.

ministers distributed pensions
ministers distributed pensions (ETV Bharat)

Ministers Distributed Pensions by Going Door to Door in AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివ్యాంగురాలు సీమా ఫర్వీన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర పింఛన్‌ అందజేశారు. వందశాతం అంగవైకల్యం ఉన్నా వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటిందని ఆమెకు పింఛన్‌ నిలిపివేసింది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును సీమా ఫర్వీన్‌ కలవగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడమేగాక అప్పట్లో సీమా ఫర్వీన్‌తో చంద్రబాబు సెల్ఫీ దిగారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తొలి పింఛన్‌ 15 వేల రూపాయలను మంత్రి కొల్లు రవీంద్ర ఆమె కుటుంబానికి అందజేశారు.

పెనమలూరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పింఛన్‌దారులతోపాటు ఇంట్లో కిందే కూర్చుని వారికి నగదు అందజేశారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ లబ్ధిదారులకు నగదు అందజేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అడివిపాలెంలో వృద్ధులు, వితంతువులకు మంత్రి రామానాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. జీవిత చరమాంకంలో ఉన్న పెద్దలకు ఎంత సాయం చేసినా తక్కువేనంటూ లబ్ధిదారుల కాళ్లను మంత్రి కడిగారు. నూజివీడులో సామాజిక పింఛన్లను మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పింఛన్‌ పంపిణీ చేయగా, కొత్తూరులో ఓ దివ్యాంగురాలు తనకు ఇచ్చిన 6 వేలలో సగం అమరావతికి విరాళంగా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోపారంలో మంత్రి కందుల దుర్గేశ్‌ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు.

ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్ కల్యాణ్‌ - Pawan Kalyan meeting in Gollaprolu

శ్రీకాకుళం జిల్లా వాండ్రాడలో వేకువజామునే ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులకు మంత్రి అచ్చెన్నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. వాలంటీర్ వ్యవస్థ లేకున్నా పింఛన్లు పంపిణీ చేయొచ్చని గతంలో తాము చెప్పినా వినకుండా వృద్ధులను ఎండలో రప్పించి జగన్ వారి ప్రాణాలు తీశారని అచ్చెన్న మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పెద్ద గుమ్మలూరులో పింఛన్ల పంపిణీలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. తహసీల్దార్‌, ఎంపీడీవో రాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి అందజేసినట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. మంత్రి స్వగ్రామం కవిరిపల్లిలో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు.

రాయలసీమ వ్యాప్తంగా పెద్దఎత్తున పింఛన్ల పంపిణీ చేపట్టారు. నంద్యాలలో మంత్రి ఫరూక్ వృద్ధులకు పింఛన్‌ పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉదయం 6 గంటలకే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మంత్రి సవిత లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ఉరవకొండ మండలం కౌకుంట్లలో మంత్రి పయ్యావుల కేశవ్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు. ధర్మవరంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌తో కలిసి పింఛన్ల పంపిణీ చేపట్టారు. మంత్రికి గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు.

నా దేశం, నేల కోసం పని చేస్తా - జీతం వద్దు : పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Speech in Gollaprolu

సీఎం 4.0ను చూస్తారు - చంద్రబాబు, లోకేశ్​ మధ్య ఆసక్తికర సంభాషణ - Chandrababu and Lokesh Conversation

Ministers Distributed Pensions by Going Door to Door in AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివ్యాంగురాలు సీమా ఫర్వీన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర పింఛన్‌ అందజేశారు. వందశాతం అంగవైకల్యం ఉన్నా వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటిందని ఆమెకు పింఛన్‌ నిలిపివేసింది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును సీమా ఫర్వీన్‌ కలవగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడమేగాక అప్పట్లో సీమా ఫర్వీన్‌తో చంద్రబాబు సెల్ఫీ దిగారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తొలి పింఛన్‌ 15 వేల రూపాయలను మంత్రి కొల్లు రవీంద్ర ఆమె కుటుంబానికి అందజేశారు.

పెనమలూరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పింఛన్‌దారులతోపాటు ఇంట్లో కిందే కూర్చుని వారికి నగదు అందజేశారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ లబ్ధిదారులకు నగదు అందజేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అడివిపాలెంలో వృద్ధులు, వితంతువులకు మంత్రి రామానాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. జీవిత చరమాంకంలో ఉన్న పెద్దలకు ఎంత సాయం చేసినా తక్కువేనంటూ లబ్ధిదారుల కాళ్లను మంత్రి కడిగారు. నూజివీడులో సామాజిక పింఛన్లను మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పింఛన్‌ పంపిణీ చేయగా, కొత్తూరులో ఓ దివ్యాంగురాలు తనకు ఇచ్చిన 6 వేలలో సగం అమరావతికి విరాళంగా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోపారంలో మంత్రి కందుల దుర్గేశ్‌ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు.

ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్ కల్యాణ్‌ - Pawan Kalyan meeting in Gollaprolu

శ్రీకాకుళం జిల్లా వాండ్రాడలో వేకువజామునే ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులకు మంత్రి అచ్చెన్నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. వాలంటీర్ వ్యవస్థ లేకున్నా పింఛన్లు పంపిణీ చేయొచ్చని గతంలో తాము చెప్పినా వినకుండా వృద్ధులను ఎండలో రప్పించి జగన్ వారి ప్రాణాలు తీశారని అచ్చెన్న మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పెద్ద గుమ్మలూరులో పింఛన్ల పంపిణీలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. తహసీల్దార్‌, ఎంపీడీవో రాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి అందజేసినట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. మంత్రి స్వగ్రామం కవిరిపల్లిలో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు.

రాయలసీమ వ్యాప్తంగా పెద్దఎత్తున పింఛన్ల పంపిణీ చేపట్టారు. నంద్యాలలో మంత్రి ఫరూక్ వృద్ధులకు పింఛన్‌ పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉదయం 6 గంటలకే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మంత్రి సవిత లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ఉరవకొండ మండలం కౌకుంట్లలో మంత్రి పయ్యావుల కేశవ్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు. ధర్మవరంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌తో కలిసి పింఛన్ల పంపిణీ చేపట్టారు. మంత్రికి గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు.

నా దేశం, నేల కోసం పని చేస్తా - జీతం వద్దు : పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Speech in Gollaprolu

సీఎం 4.0ను చూస్తారు - చంద్రబాబు, లోకేశ్​ మధ్య ఆసక్తికర సంభాషణ - Chandrababu and Lokesh Conversation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.