ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సమిష్టి కష్టం.. సమస్యకు చూపింది పరిష్కారం!

By

Published : May 23, 2020, 12:46 PM IST

అందరిలానే వారికీ సమస్య ఉంది. తోటివారిలానే వారూ ఇబ్బంది పడ్డారు. కానీ.. ఇంకెవరో సమస్య పరిష్కారించడం కాదు.. మనమే కష్టపడదాం.. పరిష్కారం చేసుకుందాం అనుకున్నారు. చేయీ చేయీ కలిపారు. విజయం వైపు అడుగులేస్తున్నారు. ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

road construction by farmers in kovvali
రహదారిని నిర్మిస్తున్న రైతులు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్విలిలో రైతులే స్వచ్ఛందంగా పంట పొలాలకు రహదారి ఏర్పాటు చేసుకుంటున్నారు. సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పొలాలకు సరైన రోడ్డు సౌకర్యం లేని కారణంగా.. వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి దిగువన సుమారు 5 కిలోమీటర్ల మేర పొడవున మార్గం ఉన్నా.. సరైన రహదారి సౌకర్యం లేక, కూలీలు రాకపోకలకు, ఎరువులు వేసేందుకు ఇన్నాళ్లూ కష్టపడ్డారు.

తమ సమస్యను తామే పరిష్కరించుకునేందుకు రైతులంతా చేయీ చేయీ కలిపారు. విరాళాలు వేసుకొని పంట పొలాలకు రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. రహదారి ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు డబ్బును చెల్లిస్తున్నారు. ప్రాథమికంగా మట్టి తరలింపు పనులు సాగిస్తున్నారు. ఈ ఏడాది మట్టితో రహదారి ఏర్పాటు చేస్తామని, వచ్చే సంవత్సరం మెటల్, గ్రావెల్​తో రోడ్డును నిర్మిస్తామని రైతు పర్వతనేని కమలాకర్​రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details