లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకు పరిమితమైన పేదలకు పౌష్టికాహారం అందజేసి ఓ దాత తన దాతృత్వం చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని వైఎస్సార్ కాలనీలో నిరుపేదలకు కోడిగుడ్లు, పాలు పంపిణీ చేశారు. బండారు రాజేంద్ర ప్రసాద్ అనే దాత అందించిన రూ. 80 వేల వ్యయంతో వెయ్యి కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పంపిణీ చేశారు.