ETV Bharat / state

ఆర్ధిక సర్వేపై స్పందించే ధైర్యం వైఎస్ జగన్​కు ఉందా?: యనమల రామకృష్ణుడు - Yanamala Challenge to YS Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 5:46 PM IST

Yanamala Rama Krishnadu Challenge to YS Jagan: జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వందేళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయిందని మండిపడ్డారు. ఆర్ధిక సర్వేపై స్పందించే ధైర్యం జగన్​కు ఉందా? అని సవాల్ విసిరారు.

yanamala_challenge_to_jagan
yanamala_challenge_to_jagan (ETV Bharat)

Yanamala Rama Krishnadu Challenge to YS Jagan: ఆర్ధిక సర్వేపై స్పందించే ధైర్యం వైఎస్ జగన్​కు ఉందా? అని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. ఐదేళ్ల జగన్ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని యనమల ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌ లైన్ పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైఎస్సార్​సీపీ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి పూర్తిగా కుప్పకూలడాన్ని ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2022-23 వివరంగా తెలియజేస్తోందని అన్నారు.

వందేళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయిందని యనమల మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడ వల్ల రాష్ట్రంలో వ్యవసాయం తగ్గిపోయిందని అన్నారు. ఉత్పత్తుల లేక అప్పుల బాధతో ఎంతో మంది రైతులు ఆత్మాహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి తప్పుడు విధానాలు, ఆక్వా విద్యుత్ రేట్ల పెంపు, అవినీతి వల్ల మత్స్య, ఆక్వా రంగాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితుల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేశారని తెలిపారు. వైఎస్సార్​సీపీ నిర్వహణాలోపంతో ప్రభుత్వాసుపత్రులను నరక కూపాలుగా తయారుచేశారని విమర్శించారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు- త్వరలో అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు: మంత్రి ఆనం - Minister Anam Review on Temples

జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని యమనల మండిపడ్డారు. విద్యుత్, విద్యా, పర్యాటక రంగాలను భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. ఎన్నడూ లేని విధంగా మీడియా ఆంక్షలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు 2014లో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారని సంపద సృష్టిస్తూనే మెరుగైన సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు.

ఒక వైపు రాష్ట్ర రాజధానిని నిర్మిస్తూనే అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేశారన్న యనమల దాని ఫలితంగా 8.98 స్థూల దేశీయోత్పత్తిని సాధించామన్నారు. ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ము, ధైర్యం జగన్‌ రెడ్డి ఉందా? అని ప్రశ్నించారు. జగన్ విధ్వంసకర విధానాలను గమనించిన ప్రజలు వైఎస్సార్​సీపీకి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారన్నారు. ఏమి చేయకుండానే అన్ని చేశామని గొప్పలు చెప్పుకున్నవారి తల రాతలను ప్రజలు తిరగ రాశేసారని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

ఓడిన వైకల్యం- ఈ యువ క్రికెటర్ల సంకల్పానికి విజయం దాసోహం! - Deaf and Dumb Cricket Players

పట్టిసీమకు గోదావరి పరవళ్లు - ఆనందంలో అన్నదాతలు - Pattiseema Lift Irrigation Project

Yanamala Rama Krishnadu Challenge to YS Jagan: ఆర్ధిక సర్వేపై స్పందించే ధైర్యం వైఎస్ జగన్​కు ఉందా? అని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. ఐదేళ్ల జగన్ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని యనమల ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌ లైన్ పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైఎస్సార్​సీపీ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి పూర్తిగా కుప్పకూలడాన్ని ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2022-23 వివరంగా తెలియజేస్తోందని అన్నారు.

వందేళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయిందని యనమల మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడ వల్ల రాష్ట్రంలో వ్యవసాయం తగ్గిపోయిందని అన్నారు. ఉత్పత్తుల లేక అప్పుల బాధతో ఎంతో మంది రైతులు ఆత్మాహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి తప్పుడు విధానాలు, ఆక్వా విద్యుత్ రేట్ల పెంపు, అవినీతి వల్ల మత్స్య, ఆక్వా రంగాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితుల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేశారని తెలిపారు. వైఎస్సార్​సీపీ నిర్వహణాలోపంతో ప్రభుత్వాసుపత్రులను నరక కూపాలుగా తయారుచేశారని విమర్శించారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు- త్వరలో అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు: మంత్రి ఆనం - Minister Anam Review on Temples

జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని యమనల మండిపడ్డారు. విద్యుత్, విద్యా, పర్యాటక రంగాలను భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. ఎన్నడూ లేని విధంగా మీడియా ఆంక్షలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు 2014లో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారని సంపద సృష్టిస్తూనే మెరుగైన సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు.

ఒక వైపు రాష్ట్ర రాజధానిని నిర్మిస్తూనే అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేశారన్న యనమల దాని ఫలితంగా 8.98 స్థూల దేశీయోత్పత్తిని సాధించామన్నారు. ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ము, ధైర్యం జగన్‌ రెడ్డి ఉందా? అని ప్రశ్నించారు. జగన్ విధ్వంసకర విధానాలను గమనించిన ప్రజలు వైఎస్సార్​సీపీకి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారన్నారు. ఏమి చేయకుండానే అన్ని చేశామని గొప్పలు చెప్పుకున్నవారి తల రాతలను ప్రజలు తిరగ రాశేసారని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

ఓడిన వైకల్యం- ఈ యువ క్రికెటర్ల సంకల్పానికి విజయం దాసోహం! - Deaf and Dumb Cricket Players

పట్టిసీమకు గోదావరి పరవళ్లు - ఆనందంలో అన్నదాతలు - Pattiseema Lift Irrigation Project

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.