ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిన్న పెళ్లి దుస్తులు కొన్నవారికి.. నేడు దశదినకర్మకు హాజరైన వారికి

By

Published : Jun 18, 2020, 10:43 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో కొవిడ్ రోజురోజుకు విస్తరిస్తుంది. అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం స్థానికులను ఆందోళన పెడుతోంది. వైరస్ కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

heavy-corona-cases-raised-in-west-godavari-district
పశ్చిమగోదావరి జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల పెళ్లి దుస్తులు కొనుగోలుకు విజయవాడ వెళ్లి వచ్చిన ముగ్గురికి కొవిడ్ సోకిన ఘటన మరవకముందే.. జగన్నాథపురంలో దశదిన కర్మకు హాజరైన వారికి కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి నియంత్రణకు కృషి చేయాలని అధికారులు సూచించారు.

ఇదీచదవండి.

'కాపుల సంక్షేమంపై సీఎం జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details