పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో దాతల సాయంతో 1100 కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సహకార సంఘం త్రిసభ్య కమిటీ ఛైర్మన్ వడ్లపట్ల శ్రీనివాసరావు, గ్రామ తెదేపా అధ్యక్షుడు, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు రాజాతో కలిసి ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు స్థానిక యువకులు ఇంటింటికి తిరిగి నిత్యావసర వస్తువులను అందజేశారు.