విజయనగరంజిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో గాయపడిన వారికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చెక్కులు పంపిణీ చేశారు. చినమేరంగి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇంకా కొంతమందికి రూ. 24 లక్షల 58 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో సీఎఫ్ఓ రామ్మోహన్రావు, డీఎఫ్ఓ సచిన్ గుప్తా, పార్వతీపురం, కురుపాం రేంజర్లు రాజబాబు, రామారావు పాల్గొన్నారు.