విశాఖ జిల్లా అనకాపల్లిలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శని, ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించడంతో అనకాపల్లిలో దుకాణాలు
అన్ని మూసేశారు. అనకాపల్లిలో వెయ్యికి పైగా కరోనా కేసులు పెరిగాయి. దీనితో సోమవారం నుంచి శుక్ర వారం వరకు పాక్షిక లాక్డౌన్, శని, అది వారాల్లో సంపూర్ణ లాక్డౌన్ పాటించాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేసిన సూచన మేరకు వ్యాపారులు సహకరించారు. ఉదయం నుంచి అన్ని దుకాణాలు మూసేసారు. దీనితో అనకాపల్లిలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.