ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అరసవల్లిలో 'ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్రబృందం సందడి

By

Published : Mar 2, 2021, 10:16 PM IST

"ఈ కథలో పాత్రలు కల్పితం" చిత్రం ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి మరో కథానాయకుడు తెరమీదకు రానున్నారు. కొణిదెల పవన్‌తేజ్, కథానాయిక మేఘన, దర్శకుడు అభిరామ్‌... తమ చిత్రాన్ని అదరించాలని కోరారు. ఈ చిత్రబృందం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకుంది.

అరసవల్లిలో 'ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్రబృందం సందడి
అరసవల్లిలో 'ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్రబృందం సందడి

మెగా ఫ్యామిలీ నుంచి మరో కథానాయకుడు తెరమీదకు రానున్నారు. "ఈ కథలో పాత్రలు కల్పితం" చిత్రం ద్వారా పరిచయం కాబోతున్న కథానాయకుడు కొణిదెల పవన్‌తేజ్‌, కథానాయిక మేఘన, దర్శకుడు అభిరామ్‌లు తమ చిత్రాన్ని ప్రేక్షకులు అదరించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి వారిని చిత్రబృందం దర్శించుకుంది. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుందన్నారు. శ్రీకాకుళానికి చెందిన డైరెక్టర్‌ అభిరామ్‌ సినిమాను చక్కగా తీర్చిదిద్దారన్నారు. సినీ ప్రచారాన్ని సిక్కోలు నుంచి ప్రారంభించడం ఆనందదాయకమని కథానాయకుడు పవన్‌తేజ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details