నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తైక్వాండో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థినులకు కొన్ని రోజులుగా శిక్షణ ఇచ్చి.. ముగింపు కార్యక్రమం చేపట్టారు. జాతీయ కోచ్ పవన్ కుమార్, తైక్వాండో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. పలు రకాల వ్యాయామాలు చేశారు. ఆత్మరక్షణ, ధైర్యంగా బతికేందుకు అవసరమైన సూచనలు తెలియజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.