కృష్ణా జిల్లా జి.కొండూరు స్పందన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో టాస్క్ఫోర్స్ & విజిలెన్స్ అధికారుల దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా కొవిడ్ ఆసుపత్రి నడుపుతున్నట్లు గుర్తించారు. కొవిడ్ బారిన పడిన ముగ్గురు పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లు అధికారులు కనుగొన్నారు. 7 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కనుగొన్నట్లు సీఐ తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు హాస్పిటల్పై జి.కొండూరు పీఎస్లో కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
అనుమతులు లేకుండా కొవిడ్ చికిత్స..ఆస్పత్రిపై అధికారుల దాడులు
జనం కరోనాతో పోరాడుతుంటే.. ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బాధితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. అధిక ఫీజులు వసూళ్లు చేయటంతోపాటుగా.. అనుమతులు లేకపోయినప్పటికీ.. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నాయి. అనుమతి లేకుండా కొవిడ్ రోగులకు వైద్యం చేస్తున్న జి.కొండూరు స్పందన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో పలు అంశాలు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు.
![అనుమతులు లేకుండా కొవిడ్ చికిత్స..ఆస్పత్రిపై అధికారుల దాడులు spandana hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11926450-446-11926450-1622170840649.jpg)
అనుమతులు లేకుండా కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రి
అనుమతులు లేకుండా కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రి