ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బెల్టు షాపు నిర్వాహకుల అరెస్టు

By

Published : Jul 25, 2019, 8:52 PM IST

గుంటూరు జిల్లా గురజాల ఎక్సైజ్ పోలీసులు బెల్టు షాపులను నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

బెల్టు షాపు నిర్వాహకులు అరెస్టు

బెల్టు షాపు నిర్వాహకులు అరెస్టు

గుంటూరు జిల్లా గురజాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తంగెడ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి మద్యం తెచ్చి తంగెడలో విక్రయిస్తున్నట్లు సమాచారంతో దాడి చేశారు. గురజాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎవరైనా బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం దుకాణదారులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని సీఐ దేవర శ్రీనివాస్ స్పష్టం చేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details