ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై కేసు నమోదు

By

Published : Apr 23, 2021, 9:09 PM IST

Updated : Apr 24, 2021, 2:24 AM IST

తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై మంగళగిరిలో కేసు నమోదైంది. తనకు ఆలపాటి సోదరుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఎన్నారై ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ పోలీసులను ఆశ్రయించారు.

ఆలపాటి రాజేంద్రప్రసాద్
మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆలపాటి రాజా నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎన్​ఆర్​ఐ ఆస్పత్రి వైస్‌ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ ఉపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడు రవీంద్రను ఎన్​ఆర్​ఐ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌లో డైరెక్టర్‌గా తీసుకోవాలంటూ ఆలపాటి రాజా బెదిరించారని ఉపేంద్ర ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టయిన టీఎన్​ఎస్ఎఫ్ నేతలను పరామర్శించానంటూ పోలీసులు కేసు నమోదు చేశారని తెదేపా నాయకుడు నాదెండ్ల బ్రహ్మం తెలిపారు. నెల్లూరు వన్ టౌన్ లో తనపై కేసు ఉందంటూ ఆ జిల్లా పోలీసులు తాడేపల్లి వచ్చి తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. 2019లో టీఎన్​ఎస్ఎఫ్ నాయకులపై దాడి జరిగితే...ఆస్పత్రిలో బాధితులను పరామర్శించినందుకు కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Last Updated : Apr 24, 2021, 2:24 AM IST

ABOUT THE AUTHOR

...view details