తూర్పుగోదావరి జిల్లా మండపేటలో లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వృత్తికారుల పరిస్థితి గమనించిన తెదేపా యువనేత, మాజీ కౌన్సిలర్ చుండ్రు రాంబాబు స్పందించారు. మండపేట 3వ వార్డులో ఉన్న వడ్రంగి, ఇతర కులవృత్తుల వారికి చేయూత అందించారు. వారికి బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. పనుల్లేక పస్తులుండేవారికి తన వంతు సాయం అందించినట్లు తెలిపారు.
వృత్తికారులకు నిత్యావసరాలు పంచిన తెదేపా నేత
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మాజీ కౌన్సిలర్ చుండ్రు రాంబాబు ఉపాధి కోల్పోయిన కులవృత్తుల వారికి నిత్యావసరాలు అందజేశారు.
![వృత్తికారులకు నిత్యావసరాలు పంచిన తెదేపా నేత tdp leader chundru rambabu distribute daily needs at mandapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6868753-327-6868753-1587381745272.jpg)
వృత్తికారులకు నిత్యావసరాలు పంచిన తెదేపా నేత చుండ్రు రాంబాబు